దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 556 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,68,523 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (160), మహారాష్ట్ర (119), కర్ణాటక (62), తమిళనాడు (58), రాజస్థాన్ (35) వంటి 5 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 17 కరోనా మరణాలు (కేరళలో 15 మరణాల సవరణతో కలిపి) నమోదవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,570కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 7వేల దిగువకు (6872 (0.02%)) చేరుకుంది.
మరోవైపు కొత్తగా 791 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,31,171 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.79 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద నవంబర్ 19, శనివారం ఉదయం 7 గంటల వరకు 219.85 కోట్లకుపైగా (2,19,85,50,222) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE