మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 5, మంగళవారం నాడు 3160 కరోనా కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,50,171 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 49,759 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 2,828 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,50,189 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.87 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.55 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 49,067 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 1,30,61,976 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































