యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. జనవరి 26 న దేశంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బోరిస్ జాన్సన్ హాజరుకావాల్సి ఉంది. అయితే యూకేలో కొత్తరకం కరోనా విజృంభణ, లాక్డౌన్ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దుచేసుకునట్టు తెలుస్తుంది. మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడి, ప్రణాళిక ప్రకారం భారతదేశ పర్యటనకు రాలేకపోతున్నానని తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో రోజువారీగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఇంగ్లాండ్ లో మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ