మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 9, శుక్రవారం నాడు 8,992 కరోనా కేసులు, 200 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 61,40,968 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,25,034 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 10,458 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 59,00,440 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.08 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.03 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,12,231 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 4,35,65,119 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ