దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో ఘనతను సాధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 6, సోమవారం ఒక్కరోజే 1.13 కోట్లకుపైగా (1,13,53,571) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. గత 11 రోజుల్లో మూడుసార్లు కోటికి పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం, దేశంలోవ్యాక్సినేషన్ ప్రక్రియ వేగానికి అద్దంపడుతోంది. గత జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన అనంతరం రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరుగుతుంది.
మరోవైపు దేశంలో ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా సెప్టెంబర్ 7, మంగళవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 69.90 కోట్లు (69,90,62,776) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 72,26,439 సెషన్స్ ద్వారా 69.90 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ