భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ ట్విట్టర్ లో సందేశం ఉంచారు. మన మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీకి జయంతి సందర్భంగా నివాళులు. మన దేశానికి ఆయన చేసిన సేవలను కూడా మనం గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా 1889లో జన్మించిన నెహ్రూ దేశానికి తొలి ప్రధానిగా పనిచేశారు. ఇక ఆయన ప్రధాని పదవిలో ఉండగానే 1964లో మరణించారు. అలాగే ఎక్కువ కాలం పనిచేసిన భారత ప్రధానమంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ సృష్టించారు.
On his birth anniversary, tributes to our former PM Pandit Jawaharlal Nehru Ji. We also recall his contribution to our nation.
— Narendra Modi (@narendramodi) November 14, 2022
ఇక కాంగ్రెస్ కూడా జవహర్లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులు అర్పించింది. నెహ్రూ అద్భుతమైన సహకారం లేకుండా 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఊహించలేమని పేర్కొంది. న్యూఢిల్లీలోని నెహ్రూ స్మారకం శాంతి వనానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రగతిశీల ఆలోచనలు సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాయని ఖర్గే అభిప్రాయపడ్డారు.
Pandit Nehru — the maker of modern India.
21st India cannot be imagined without his tremendous contribution.
A champion of Democracy, his progressive thoughts furthered India’s social,political & economic development, despite the challenges.
My humble homage to a true patriot. pic.twitter.com/JTltZPrJWo
— Mallikarjun Kharge (@kharge) November 14, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE