భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య న్యూఢిల్లీలో 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం (India-Russia Annual Summit) జరిగింది. ఈ కీలక చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య మైత్రిని, భవిష్యత్ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి.
రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రపంచ సవాళ్లు ఎన్ని ఎదురైనా, ఇరు దేశాల బంధం చెక్కుచెదరలేదని ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.
Addressing the joint press meet with President Putin.@KremlinRussia_E https://t.co/ECjpvWj7CF
— Narendra Modi (@narendramodi) December 5, 2025
ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు
-
సుస్థిర మైత్రి: గత ఎనిమిది దశాబ్దాలుగా ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, భారత్-రష్యా మైత్రి ‘ధ్రువతార’ వలె సుస్థిరంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంబంధాలు పరస్పర గౌరవం, లోతైన విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.
-
ఉక్రెయిన్ సంక్షోభంపై వైఖరి: ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ కేవలం “తటస్థంగా” లేదని, “శాంతి వైపు” ఉందని మోదీ స్పష్టం చేశారు. ఈ సంక్షోభ సమయంలో కూడా ఇరు దేశాల మధ్య నిరంతర సంప్రదింపులు, విశ్వాసం కొనసాగాయని హైలైట్ చేశారు.
-
ఆర్థిక సహకారం: 2030 వరకు ఇరు దేశాల మధ్య ‘ఆర్థిక సహకార కార్యక్రమం’పై ఏకాభిప్రాయం కుదిరిందని ప్రధాని ప్రకటించారు. అలాగే, యూరేషియన్ ఎకనామిక్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) త్వరగా ముగిసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
-
ఉగ్రవాదంపై పోరు: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్, రష్యాలు భుజం భుజం కలిపి నడుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పహల్గామ్ నుంచి క్రోకస్ సిటీ హాల్ వరకు జరిగిన ఉగ్రదాడుల మూలం ఒకటేనని, ఉగ్రవాదంపై ప్రపంచ ఏకతే తమ బలం అని పునరుద్ఘాటించారు.
-
శక్తి, రక్షణ: ఇంధన భద్రత, పౌర అణుశక్తి రంగాల్లో సహకారం భారత్-రష్యా భాగస్వామ్యానికి కీలకమైన స్తంభాలని ప్రధాని తెలిపారు.
My remarks during meeting with President Putin. https://t.co/VCcSpgZmWx
— Narendra Modi (@narendramodi) December 5, 2025
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యలు
-
లోతైన బంధం: భారత్-రష్యా సంబంధాల చారిత్రక, లోతైన మూలాలను పుతిన్ నొక్కి చెప్పారు. ఈ బంధానికి ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ప్రశంసించారు.
-
ఉక్రెయిన్ చర్చల్లో మోదీ పాత్ర: ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రధాని మోదీ చూపుతున్న ప్రయత్నాలకు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.
-
ఇంధన సరఫరా: పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ భరోసా ఇచ్చారు.
-
భవిష్యత్ సహకారం: సైనిక-సాంకేతిక సహకారం, అంతరిక్షం, విమానయానం, కృత్రిమ మేధ (AI) వంటి అత్యాధునిక రంగాలలో ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పుతిన్ తెలిపారు.
సదస్సులోని కీలక పరిణామాలు
-
Vision 2030: ఇరు దేశాల ఆర్థిక సహకారాన్ని పెంచేందుకు “Vision 2030” పత్రాన్ని ఇరు నేతలు ఆవిష్కరించారు.
-
సాంకేతికత, వాణిజ్యం: రక్షణ రంగంతో పాటు, ఇంధనం, సాంకేతికత, విద్య, కార్మిక వలసలు (labour mobility) వంటి రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
ఇక శుక్రవారం రాజ్ఘాట్ను సందర్శించారు పుతిన్. రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్కు పుతిన్ చేరుకున్నారు. పుతిన్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు పుతిన్.
కాగా, అంతకుముందు రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ భగవద్గీతను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు మోదీ. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గీత ఒక ప్రేరణాత్మక గ్రంథమని ప్రధాని అభివర్ణించారు.
Подарил Президенту Путину экземпляр Бхагавад-гиты на русском языке. Учения Гиты вдохновляют миллионы людей по всему миру.@KremlinRussia_E pic.twitter.com/vQWG75l5IE
— Narendra Modi (@narendramodi) December 5, 2025







































