కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ విధించినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను ఉల్లంఘిస్తున్నవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలకు కీలక దేశాలు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఏప్రిల్ 2, గురువారం నాడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఒక లేఖ రాశారు. అలాగే నిబంధనల ఉల్లంఘనకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఒక జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. ఈ నిర్ణిత లాక్డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. నిబంధనల జాబితాకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
#IndiaFightsCOVID19
MHA writes to States to widely publicize the Penal Provisions regarding Violations of Lockdown Measures to fight #COVID19.Strict Action to be taken by Authorities on Violators of Lockdown Measures: MHA to States
Details 👇https://t.co/SvZEH9RHcY pic.twitter.com/zEnzQqoy7z
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 2, 2020
[subscribe]