తుఫాన్లతో నష్టం: ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల అదనపు సాయం

24596 Cr National Disaster Response Fund To Telangana, 24596 Cr to Telangana From NDRF, Centre Approves 24596 Cr to Telangana, Disaster Management, Mango News, National Disaster Response Fund, National Disaster Response Fund To Telangana, NDRF, Telangana Floods Loss, Telangana National Disaster Response Fund, telangana state disaster response

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో నైరుతి రుతుపవనాల సందర్భంగా వరదలు/కొండచరియలు విరిగిపడడంతో నష్టంతో పాటుగా 2019-20 రబీ సమయంలో వడగళ్ళు వానలతో నష్టపోయిన అస్సాం, తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి 5 రాష్ట్రాలకు రూ.1751.05 కోట్ల సహాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఎస్‌డిఆర్‌ఎఫ్ నుంచి 28 రాష్ట్రాలకు రూ.19,036.43 కోట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి 11 రాష్ట్రాలకు రూ.4,409.71 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు.

కేంద్రం నుంచి అదనపు సాయం పొందిన రాష్ట్రాలివే:

  • అస్సాం – రూ.437.15 కోట్లు
  • తెలంగాణ – రూ.245.96 కోట్లు
  • ఉత్తరప్రదేశ్‌ – రూ.386.06 కోట్లు
  • ఒడిశా – రూ.320.94 కోట్లు
  • అరుణాచల్ ప్రదేశ్‌ – రూ.75.86 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ