ముంబయిలో ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలకు కూడా లోకల్ ట్రైన్స్ లో అనుమతి

local train services to resume for general public, Maharashtra, Maharashtra CM Uddhav Thackeray, Maharashtra Govt, Maharashtra Govt Decides to Open Mumbai Local Train Services, Mango News, mumbai local train, mumbai local train news, Mumbai local train services, Mumbai Local Train Services for General Public, Mumbai Local Train Services to Resume, Mumbai local train services to resume for general public

ముంబయి నగరంలో కీలక రవాణా వ్యవస్థ అయిన లోకల్ ట్రైన్స్ పై మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కీలక నిర్ణయం ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుండి సాధారణ ప్రజలను కూడా లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించడానికి అనుమతించాలని నిర్ణయించింది. అయితే ప్రజల ప్రయాణ సమయాలపై పరిమితులు విధించారు. ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు లోకల్ ట్రైన్స్ లో ఉదయం 7 గంటలకు ముందు, మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య మరియు రాత్రి 9 గంటల తరువాత ప్రయాణించడానికి అనుమతించాలని నిర్ణయించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత సంవత్సరం మార్చి నుంచి ముంబయిలో లోకల్ ట్రైన్స్ ను పూర్తిగా మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక అత్యవసర సిబ్బంది, బోధన, బోధనేతర సిబ్బంది, న్యాయవాదులు, మహిళా ప్రయాణీకులు, వికలాంగులను సహా కొంతమందికే అనుమతి ఇస్తూ దశలవారీగా లోకల్ ట్రైన్స్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల నుంచి కూడా డిమాండ్ పెరుగుతుండడంతో అందరికీ లోకల్ ట్రైన్స్ సేవలను తిరిగి ప్రారంభించాలనే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ ప్రజలకు అనుమతి ఇచ్చినప్పటికీ ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి 9 గంటల వరకు అవసరమైన సేవల సిబ్బందికి మాత్రమే ముంబయిలో లోకల్ ట్రైన్స్ సేవలను ఉపయోగించడానికి అనుమతి ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − ten =