తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్

CM Revanth Clarifies Telanganas Financial Situation, Telanganas Financial Situation, Telanganas Financial Situation Clarifies CM, CM Revanth Reddy, Development Funds, Financial Crisis, State Revenue, Telangana Economy, Financial Situation, Hyderabad, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించారు. రాష్ట్రానికి నెలవారీగా వచ్చే ఆదాయం, ఖర్చు వివరాలను మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు సుమారు ₹18,500 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. అయితే, గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు చెల్లించడం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం ₹13,000 కోట్ల మేర ఖర్చవుతోందని పేర్కొన్నారు. మిగిలిన ₹5,000 కోట్లతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ప్రభుత్వ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే మరింతగా ₹4,000 కోట్లు అవసరమని సీఎం రేవంత్ తెలిపారు.

ప్రభుత్వ ఖజానా పరిస్థితిని మెరుగుపరచడానికి ₹4,000 కోట్ల అదనపు ఆదాయం ఎలా సమకూర్చుకోవచ్చో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొంతకాలంగా GST వసూళ్లు, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినా, తాజాగా వీటిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. అదనంగా, ప్రాపర్టీ ట్యాక్స్, ఇసుక అక్రమ రవాణా కట్టడి, ఎల్‌ఆర్ఎస్ లాంటి అంశాల్లో సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవలి బీర్ ధరల పెంపుతో ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెరుగుతోందని సీఎం వెల్లడించారు.

కేంద్రం సహాయంపై సీఎం దృష్టి
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ఆర్థిక సాయం, అభివృద్ధి నిధుల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ఆర్థిక సమస్యలు వివరించి, అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నెలకు ₹10,000 కోట్ల మేర అదనపు నిధులు అవసరమని సీఎం అంచనా వేశారు. అందుకు తగిన విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. అందుకే ఖజానాపై పూర్తి ఫోకస్ పెట్టి, నిధుల వేటను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.