భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు హైదరాబాద్కు విచ్చేశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఎంపీలు, కీలక నేతలు అనేక మంది నగరంలో విడిది చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదివారం ఉదయం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ యోగికి భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది.
సీఎం యోగి వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా ఇతర బీజేపీ నేతలు ఉన్నారు. కాగా యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ మూడు వలయాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో రూట్ టాప్ భద్రతను నిర్వహించారు. దాదాపు 350 మంది సిబ్బందితో చార్మినార్, భాగ్యలక్ష్మి, లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ