తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఇంజనీర్ మానసా వారణాసి వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి ముంబయిలో ఫెమినా మిస్ ఇండియా 2020 ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో మానసా వారణాసి మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని దక్కించుకుంది. ఇక హర్యానాకు చెందిన మణికా షియోకాండ్ను మిస్ గ్రాండ్ ఇండియా 2020 గా నిలువగా, ఉత్తరప్రదేశ్కు రాష్ట్రానికి చెందిన మన్య సింగ్ ను మిస్ ఇండియా 2020 రన్నరప్ గా ప్రకటించారు. ఈ మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్లో ప్రముఖ నటి నటులు నేహా ధూపియా, చిత్రంగధ సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్లు పాల్గుణి,షేన్ పీకాక్ ఉన్నారు. మరోవైపు మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటం దక్కించుకున్న మానసా వారణాసి, డిసెంబర్ 2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ