తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 12, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,475 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. సోమవారం నాడు కొత్తగా 1931 కేసులు నమోదవగా, 23,303 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 665 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 63,074 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,736 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.93 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.76 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1931):
- జీహెచ్ఎంసీ – 298
- వరంగల్ అర్బన్ – 144
- రంగారెడ్డి – 124
- కరీంనగర్ – 89
- సంగారెడ్డి – 86
- నల్గొండ – 84
- ఖమ్మం – 73
- మేడ్చల్ – 71
- సిద్దిపేట – 71
- పెద్దపల్లి – 64
- సూర్యాపేట – 64
- జనగామ – 59
- జోగులాంబ గద్వాల్ – 56
- సిరిసిల్ల – 54
- నాగర్ కర్నూల్ – 53
- నిజామాబాద్ – 53
- జగిత్యాల – 52
- మంచిర్యాల – 45
- మహబూబ్ నగర్ – 43
- కామారెడ్డి – 39
- భద్రాద్రి కొత్తగూడెం – 39
- వనపర్తి – 38
- మహబూబాబాద్ – 34
- ములుగు – 29
- ఆదిలాబాద్ – 28
- వరంగల్ రూరల్ -26
- నిర్మల్ – 24
- వికారాబాద్ – 19
- మెదక్ – 18
- యాదాద్రి భువనగిరి – 18
- జయశంకర్ భూపాలపల్లి – 17
- నారాయణ్ పేట్ – 16
- ఆసిఫాబాద్ – 3
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu