తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 385 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 21, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,87,063 కి పెరిగింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,109 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక సోమవారం నాడు 39,386 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 733 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,78,167 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,787 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (385):
- జీహెచ్ఎంసీ ఏరియా – 95
- రంగారెడ్డి – 31
- మేడ్చల్ మల్కాజిగిరి – 27
- ఖమ్మం – 21
- సంగారెడ్డి – 17
- మహబూబ్ నగర్ – 14
- నల్గొండ – 13
- సూర్యాపేట – 12
- హనుమకొండ – 11
- జగిత్యాల – 11
- రాజన్న సిరిసిల్ల – 11
- భద్రాద్రి కొత్తగూడెం – 10
- పెద్దపల్లి – 10
- నిజామాబాద్ – 9
- సిద్దిపేట – 9
- మంచిర్యాల – 8
- వికారాబాద్ – 8
- కరీంనగర్ – 8
- ఆదిలాబాద్ – 8
- యాదాద్రి భువనగిరి – 7
- నిర్మల్ – 7
- ములుగు – 5
- వనపర్తి – 5
- కొమరం భీం ఆసిఫాబాద్ – 4
- నాగర్ కర్నూల్ – 4
- జనగామ – 4
- మహబూబాబాద్ – 4
- వరంగల్ రూరల్ – 4
- మెదక్ – 3
- నారాయణ్ పేట్ – 2
- కామారెడ్డి – 2
- జయశంకర్ భూపాలపల్లి – 1
- జోగులాంబ గద్వాల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ