ఏపీలో కరోనా విజృంభణ: ఒకేరోజులో 9742 పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు

AP Corona Updates : 9742 New Positive Cases, 86 Deaths Reported Today

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9742 పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 18, బుధవారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,003 కు, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 2906 కి చేరింది. మరో 8061 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. గత 24 గంటల్లో 57685 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.

కరోనా వలన గత 24 గంటల్లోనే చిత్తూరులో పదిహేను మంది, నెల్లూరులో పదిహేను మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2906 కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 19, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 30,19,296
  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 3,16,003
  • కొత్తగా నమోదైనా కేసులు : 9742
  • నమోదైన మరణాలు : 86
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 2,26,372
  • యాక్టీవ్ కేసులు : 86725
  • మొత్తం మరణాల సంఖ్య : 2906

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 2 =