తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన ప్రమాదంలో మృతి చెందినవారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదే ప్రమాదంలో గాయపడిన వారికి ₹ 50,000 పరిహారం ప్రకటించారు. “తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అందజేయబడుతుంది” అని ప్రధానమంత్రి కార్యాలయం (PMO), ఒక ట్వీట్లో పేర్కొంది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను . మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అందజేయబడుతుంది. : ప్రధాని మోదీ
— PMO India (@PMOIndia) May 9, 2022
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా హసన్పల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో లారీ, మినీ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. మినీవ్యాన్లోని వ్యక్తులు యల్లారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా నిజాంసాగర్ మండలం హసన్పల్లి గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి నిందితుడు లారీ డ్రైవర్ను గుర్తించామని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని కామారెడ్డి పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు.. అంజవ్వ (35 సంవత్సరాలు), వీరమణి (35 సంవత్సరాలు), లచ్చవ్వ (60 సంవత్సరాలు), సాయవ్వ (38 సంవత్సరాలు), సాయిలు (35 సంవత్సరాలు), ఎల్లయ్య (53 సంవత్సరాలు), పోశయ్య (60 సంవత్సరాలు), గంగవ్వ ( 45 ఏళ్లు), వీరవ్వ (70 ఏళ్లు).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ