తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ముందుగా ఏప్రిల్ 19న స్వల్ప లక్షణాలతో సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు అప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఐసోలేషన్ లో ఉన్నారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు నేతృత్వంలోని వైద్యుల బృందం సీఎం ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ క్రమంలో మే 4, మంగళవారం నాడు నిర్వహించిన రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో రిపోర్టులు నెగటివ్ గా వచ్చాయని, సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో దాదాపు 20 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్కు చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఈ రోజు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కూడా సీఎం కేసీఆర్ కు బదిలీ అయిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ