ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి సీపీఐ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే సచివాలయం ముట్టడికి సీపీఐ నేతలు సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో సచివాలయం వద్దకు వెళ్లే క్రమంలో సీపీఐ కార్యకర్తలు, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారన్న సమాచారం అందడంతో దాసరి భవన్ వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించారు. కాగా సుమారు 200 మందికి పైగా కార్యకర్తలు సీపీఐ కార్యాలయం లోపల ఉన్నారు. బయట కూడా భారీగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే బయటకు వస్తే నాయకులను అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కార్యాలయం లోపలకు పోలీసులను వెళ్ళనీయకుండా గేటు వద్ద సీపీఐ, అనుబంధ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయింది. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మరింతమంది పొలిసు బృందాలను దింపుతున్నారు అధికారులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ