తెలంగాణలో మరో 1,430 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో మరో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 21, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 47,705 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 16,855 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 7 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 429 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.89 (<1%) శాతంగా ఉంది.

ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 2,062 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 36,385 కి చేరింది. దీంతో రికవరీ రేటు 76 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 10,891 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 703, రంగారెడ్డిలో 117, మేడ్చల్ ‌లో 105, సంగారెడ్డిలో 50, నిజామాబాద్ ‌లో 48, నల్గొండ లో 45, కామారెడ్డిలో 43, వరంగల్‌ అర్బన్‌లో 34, కరీంనగర్‌, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేటలో 27 చొప్పున, మెదక్‌లో 26, వరంగల్‌ రూరల్‌లో 20, జగిత్యాల, నాగర్ కర్నూల్ లో 18 చొప్పున, సిద్ధిపేట, ఖమ్మంలో 14 చొప్పున, జనగామ, వికారాబాద్, యాదాద్రి భువనగిరి లో 9 చొప్పున నమోదయ్యాయి.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu