భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికి దేశంలో కరోనా వైరస్ వలన మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఇటీవల ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 64 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 79476 కేసులు, 1069 మరణాలు నమోదయ్యాయి.
దీంతో అక్టోబర్ 3, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 64,73,544 కు, మరణాల సంఖ్య 1,00,842 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 54 లక్షలు దాటింది. ఒకే రోజులో 75,628 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 54,27,706 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 83.8 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 3, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 64,73,544
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 2–అక్టోబర్ 3 (8AM-8AM)] : 79476
- నమోదైన మరణాలు : 1069
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 54,27,706
- యాక్టీవ్ కేసులు : 9,44,996
- మొత్తం మరణాల సంఖ్య : 1,00,842
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu