తెలంగాణ రాష్ట్రంలో జూలై 27, సోమవారం నాటికీ 3,79,081 కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాడు 15,839 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 42909 కి చేరడంతో రికవరీ శాతం 75.1 శాతంగా నమోదైంది. మరోవైపు కొత్తగా 1610 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 27 రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 57,142 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 531, రంగారెడ్డి లో 172, వరంగల్ అర్బన్ లో 152, మేడ్చల్ లో 113, సంగారెడ్డిలో 74, నిజామాబాద్ లో 58, కరీంనగర్ లో 48, పెద్దపల్లిలో 48, సూర్యాపేటలో 35, గద్వాల్ లో 34, ములుగులో 32, ఖమ్మంలో 26, నల్గొండలో 26, వరంగల్ రూరల్ లో 25, మహబూబ్ నగర్ లో 23, జయశంకర్ భూపాలపల్లిలో 20, కామారెడ్డిలో 18, జనగామలో 18, భద్రాద్రి కొత్తగూడెంలో 16, మహబూబాబాద్ లో 14, సిరిసిల్లలో 14, సిద్దిపేటలో 14, నారాయణపేట్ లో 14, ఆదిలాబాద్ లో 13, మంచిర్యాలలో 13, జగిత్యాలలో 12, మెదక్ లో 12, యాదాద్రి భువనగిరిలో 12, వికారాబాద్ లో 11, నాగర్ కర్నూల్ లో 9 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 27, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 3,79,081
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 57,142
- కొత్తగా నమోదైన కేసులు : 1610
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 42,909
- కరోనా రికవరీ రేటు: 75.1%
- యాక్టీవ్ కేసులు : 13,753
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 8479
- మొత్తం మరణాల సంఖ్య : 480
- కరోనా మరణాల రేటు: 0.84%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu