బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా నియమితులైన శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు కు నా తరపున, జనసేన పార్టీ తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాజకీయంగా ఎంతో అనుభవం, పుష్కలమైన నాయకత్వపు లక్షణాలు, సేవ తత్పరత కలిగిన వీర్రాజు నాయకత్వంలో బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వీర్రాజుకు క్షేత్ర స్థాయిలో పేద వర్గాల సమస్యలపై ఎంతో అవగాహన ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంలో మీతో కలసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నానని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ-జనసేన పార్టీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu