తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్గా తేలినట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. మరోవైపు మే 8, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 68,462 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ