తెలంగాణలో భారీగా కరోనా కేసులు: 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2012 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 4, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 70,958 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 13 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 576 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.81% (< 1%) శాతంగా ఉంది.

ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1139 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 50,814 కి చేరింది. ప్రస్తుతం 19,568 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 71.6 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 532, మేడ్చ‌ల్ లో 198, రంగారెడ్డిలో 188, వ‌రంగ‌ల్‌ అర్బన్ లో 127, ఖ‌మ్మంలో 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‌ లో 83, కామారెడ్డిలో 75, కొత్త‌గూడెంలో 52, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ‌లో 51, నల్గొండలో 49, జోగులాంబ గద్వాల్ ‌లో 48, జయశంకర్ భూపాల‌ప‌ల్లిలో 46, పెద్ద‌ప‌ల్లిలో 41, క‌రీంన‌గ‌ర్ ‌లో 41, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ‌లో 36, సిద్దిపేట‌లో 28, వ‌రంగ‌ల్ రూరల్ లో 28, జ‌గిత్యాల‌లో 27, సూర్యాపేట‌లో 27, యాదాద్రి భువ‌న‌గిరిలో 26, మెదక్ లో 21, వ‌న‌ప‌ర్తిలో 20, నాగ‌ర్‌క‌ర్నూల్‌ లో 19, ములుగులో 18, ఆదిలాబాద్‌ లో 15, సిరిసిల్ల‌లో 10 కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu