దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,34,445 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 1329 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,93,310 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అస్సాం, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, పంజాబ్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 6,12,868 (2.03%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 64,527 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,91,28,267 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.66 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.31 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 25, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 39,95,68,448
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,01,34,445
- కొత్తగా నమోదైన కేసులు [జూన్ 24–జూన్ 25 (8AM-8AM)] : 51,667
- నమోదైన మరణాలు : 1329
- రికవరీ అయిన వారి సంఖ్య : 2,91,28,267
- యాక్టీవ్ కేసులు : 6,12,868
- మొత్తం మరణాల సంఖ్య : 3,93,310
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ