అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు పీఎం మోదీ అయోధ్యలో దాదాపు మూడు గంటలపాటు గడుపనున్నారు. పీఎం మోదీ పర్యటన యొక్క వివరాలను అధికారులు విడుదల చేశారు.
పీఎం మోదీ అయోధ్య షెడ్యూల్: ( ఆగస్టు 5, బుధవారం)
- ఉదయం 9.35 గంటలు – ఢిల్లీ నుంచి లక్నో కు బయలుదేరనున్న ప్రధాని
- ఉదయం 10.35 గంటలు – లక్నో విమానాశ్రయానికి చేరుకుంటారు
- ఉదయం 10.40 గంటలు – హెలికాప్టర్లో అయోధ్యకు బయలుదేరుతారు
- ఉదయం 11.30 గంటలు – అయోధ్యలోని సాకేత్ విమానాశ్రయానికి చేరుకుంటారు
- ఉదయం 11.40 గంటలు – హనుమాన్ గడీలో పూజలు నిర్వహిస్తారు
- మధ్యాహ్నం 12 గంటలు – రామజన్మభూమిలో రామ్లల్లా దర్శనం
- మధ్యాహ్నం 12.15 గంటలు – ఆలయ ప్రాంగణంలో పారిజాత (కొరల్ జాస్మిన్) మొక్క నాటుతారు
- మధ్యాహ్నం 12.30 గంటలు – భూమిపూజ ప్రారంభం
- మధ్యాహ్నం 12.40 గంటలు – భూమిపూజ – పునాదిరాయి
- మధ్యాహ్నం 1.10 గంటలు – శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో సమావేశం
- మధ్యాహ్నం 2.05 గంటలు – అయోధ్య నుంచి హెలికాప్టర్లో లక్నోకు ప్రయాణం
- మధ్యాహ్నం 2.20 గంటలు – లక్నో నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu