అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రామ్దేవ్, చిదానంద్ మహరాజ్, స్వామి అవ్దేశానంద్ గిరి, సహా పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యకు చేరుకున్న పీఎం మోదీ ముందుగా హనుమాన్గఢీ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించే ప్రదేశానికి చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భూమి పూజ నేపథ్యంలో అయోధ్యతో సహా దేశంలో పండుగ వాతావరణం నెలకొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu