తెలంగాణలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Graduates MLC Elections Polling In Telangana, Graduates MLC Elections Polling Updates, Mango News, MLC Elections, MLC Elections Polling, MLC Elections Polling In Telangana, Telangana Graduates MLC Elections Polling Live, Telangana Graduates MLC Elections Polling Live Updates, Telangana Graduates MLC Elections Polling Updates, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections Polling, Telangana MLC Elections Polling Live Updates

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ లోని షేక్​పేట్​ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగ్ కేంద్రాల్లో జంబో బ్యాలెట్‌ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 731 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,05,565 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 799 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,31,268 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 17న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ