దేశ వ్యాప్తంగా శనివారం నాడు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్కేఆర్ భవన్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రీజ్వి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డా.గంగాధర్ పాల్గొన్నారు.
కరోనా వాక్సిన్ డోసులు మరిన్ని ఇవ్వాలి:
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 140 కరోనా వ్యాక్సిన్ పంపిణి కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తొలిరోజు 90 శాతం టార్గెట్ చేరుకున్నాం. అన్ని సెంటర్స్ లో కో-విన్ సాప్ట్ వేర్ పనిచేయడం లేదు. సాఫ్ట్ వేర్ లో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించి ఇంకా సరళతరం చేయండి. అలాగే రాష్ట్రానికి కరోనా వాక్సిన్ డోసులు మరిన్ని ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కు విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ “దేశ వ్యాప్తంగా కరోనా వారియర్స్ కి వాక్సిన్ అందిస్తున్నాము. ముందుగా హెల్త్ వర్కర్స్ కి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. చాలా మంది మీరు వాక్సిన్ వేసుకొరా అని నన్ను ప్రశ్నించారు. నావంతు అంటే 50 సంవత్సరాల పైబడిన వారికి వాక్సిన్ వేసేటప్పుడు వేసుకుంటాను అని చెప్పాను. ఈ వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి మీ అందరి సహకారం అవసరం. దేశమంతా సమిష్టిగా పనిచేసి పోలియోను పారద్రోలాము. కరోనాను కూడా లేకుండా చేద్దాం” అని అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులను కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ