తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే జూలై 15 వరకు పొడిగింపు

Demolition of Telangana Secretariat, Stay Secretariat Demolition, telangana, Telangana High Court, Telangana High Court Extends Stay Secretariat Demolition, Telangana News, telangana secretariat, Telangana Secretariat Demolition, Telangana Secretariat Demolition Process

తెలంగాణలో సచివాలయ భవనాల కూల్చివేత పక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జూలై 13, సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. సచివాలయం కూల్చివేతకు సంబంధించి పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్టే గడువు ముగియడంతో తిరిగి ఈ అంశంపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం భవనాల కూల్చివేతపై స్టే ను జూలై 15 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వం కూడా భవనాల కూల్చివేత అనుమతులపై కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్లపై తదుపరి విచారణ జూలై 15 న జరగనుంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here