రూ.426 కోట్ల‌తో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ‌స్టీల్‌ బ్రిడ్జి, మరో ఫ్లైఓవ‌ర్ కు శంకు స్థాపన

Elevated Corridor and Flyover, Elevated Corridor and Flyover in Hyderabad, foundation stone for elevated corridor, KTR, KTR Lays Foundation of Two Flyovers In Hyderabad, Minister KTR, Minister KTR Latest News, Minister KTR Lay Foundation Stone to Elevated Corridor, Telangana, Telangana news

హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్‌, మ‌రో ఫ్లైఓవ‌ర్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు భూమి పూజ చేశారు. రూ.350 కోట్ల‌తో ఇందిరా పార్కు నుండి వి.ఎస్‌.టి వరకు మొద‌టి ద‌శలో నిర్మించ‌నున్న‌ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, అదేవిధంగా మ‌రో రూ.76 కోట్ల‌తో రాంన‌గ‌ర్ నుండి బాగ్‌లింగంప‌ల్లి పేజ్‌-2 సెకండ్ లేవ‌ల్ లో 3 లేన్ ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఎస్సార్‌డీపీలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్‌, మ‌రో ఫ్లైఓవ‌ర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో అన్నిపెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ మొదలైన మార్చ్ నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 4 రేట్ల వేగంతో పనులను పూర్తి చేశామని, 9 నెలల సమయం పట్టే పనులు లాక్‌డౌన్‌ వలన రెండు నెలలలోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మొత్తం రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu