హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భూమి పూజ చేశారు. రూ.350 కోట్లతో ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి వరకు మొదటి దశలో నిర్మించనున్న నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, అదేవిధంగా మరో రూ.76 కోట్లతో రాంనగర్ నుండి బాగ్లింగంపల్లి పేజ్-2 సెకండ్ లేవల్ లో 3 లేన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్సార్డీపీలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో అన్నిపెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. లాక్డౌన్ మొదలైన మార్చ్ నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 4 రేట్ల వేగంతో పనులను పూర్తి చేశామని, 9 నెలల సమయం పట్టే పనులు లాక్డౌన్ వలన రెండు నెలలలోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మొత్తం రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu