పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని జూన్ 19, శుక్రవారం నాడు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. రూ.6 కోట్ల బల్దియా నిధులతో నిర్మించిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి వలన పంజాగుట్ట- జూబ్లీ హిల్స్ చెక్పోస్టు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా పలు ఏర్పాట్లు చేస్తుందని, ఈ వంతెన నిర్మాణ పనులు లాక్డౌన్ సమయంలో కూడా జరిగినట్లు చెప్పారు. తక్కువ సమయంలోనే ఈ బ్రిడ్జిని నిర్మాణానికి తోడ్పడిన అధికారులు, సిబ్బందికి మంత్రులు అభినందనలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu