ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 465 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 376 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 70, విదేశాల నుంచి వచ్చిన వారు 19 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 465 కేసులతో కలిపి జూన్ 19, శుక్రవారానికి ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7961 కు చేరింది. గత 24 గంటల్లో 17609 సాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 6230 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 1731 మంది ఉన్నారు. మరోవైపు కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 96 కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 3065 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 82 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 3069 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: As on 19th June, 10:00AM
COVID Positives: 6230
Discharged: 3065
Deceased: 96
Active Cases: 3069#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/zMMwNYYpJH— ArogyaAndhra (@ArogyaAndhra) June 19, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu