రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యుడికి మరో షాక్. మరోసారి గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే వర్తిస్తాయని పేర్కొన్నాయి. దీంతో ప్రస్తుతం రూ.1055గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1105కు చేరింది. అయితే సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించాయి. అయితే అప్పుడు డొమెస్టిక్ సిలిండర్ ధరల సూచీ మారలేదు. కానీ అనూహ్యంగా ఈరోజు రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటన చేసాయి.
#AchheDin Aa Gaye 👏 Badhai Ho #LPG over ₹1050 👇 An increase again of ₹50
Modi Ji’s Gift to all Indian Households👍 https://t.co/BknwJ2zNfi
— KTR (@KTRTRS) July 6, 2022
కాగా దీనిపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘అందరికి శుభాకాంక్షలు. మంచి రోజులు వచ్చేశాయ్.. గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచింది. వంటింటి సిలిండర్ ధర పెంచి దేశంలోని మహిళలందరికీ ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు’ అని ట్విట్టర్ వేదికగా సిలిండర్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడచిన కొన్ని నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సిలిండర్ ధర పెంపు అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ