మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన తొలిరోజు: తెలంగాణలో పెట్టుబడులకు సిద్దమైన స్విస్‌ రీ, మీషో, కీమో, లూలు గ్రూప్ కంపెనీలు

Minister KTR Davos Tour Swiss Re Meesho Chemo Pharma and Lulu Group Accepts To Invest in Telangana, Telangana Minister KTR Davos Tour Swiss Re Meesho Chemo Pharma and Lulu Group Accepts To Invest in Telangana, Minister KTR Davos Tour Swiss Re Accepts To Invest in Telangana, Minister KTR Davos Tour Meesho Accepts To Invest in Telangana, Minister KTR Davos Tour Chemo Pharma Accepts To Invest in Telangana, Minister KTR Davos Tour Lulu Group Accepts To Invest in Telangana, Minister KTR Davos Tour, Minister KTR Davos Tour News, Minister KTR Davos Tour Latest News, Minister KTR Davos Tour Latest Updates, Minister KTR Davos Tour Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల తొలిరోజు సోమవారం తెలంగాణకు 600 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. దావోస్‌ పర్యటన తొలిరోజు ఆయన పలు అంతర్జాతీయ కంపెనీల అధిపతులతో మరియు ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్‌ తో కీలక చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టనున్నట్లు పలు అంతర్జాతీయ కంపెనీలు దావోస్ వేదికగా ప్రకటించాయి. వీటిలో.. ప్రముఖ బీమా సంస్థ – స్విస్‌ రీ, ఈకామర్స్ సంస్థ- మీషో, స్పానిష్ ఫార్మా కంపెనీ కీమో మరియు లూలు గ్రూప్ వంటివి ఉన్నాయి. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్‌, ఫైనా న్స్‌, బీమా రంగ సంస్థ స్విస్‌రీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్విస్‌రీ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెరోనికా సాట్టి, ఎండీ పబ్లిక్‌ సెక్టార్‌ సొల్యూషన్స్‌ ఇవో మెం జింగ్నర్‌ సోమవారం దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశంలో దీనిపై స్పష్టతనిచ్చారు. ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులతో పాటు రిస్క్ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలపై పని చేస్తామని వివరించారు. ముందుగా 250 మంది ఉద్యోగులతో మొదలై ఆ తర్వాత దశలవారీగా ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని చెప్పారు.

ఇక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ జీన్ డేనియల్ బోనీ నేతృత్వంలోని కీమో ఫార్మా లీడర్‌షిప్ టీమ్‌తో కూడా కేటీఆర్ చర్చలు జరిపారు. ఫలితంగా స్పెయిన్‌కు చెందిన కీమో ఫార్మా, వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో ఫార్మాస్యూటికల్ పూర్తి డోసేజ్ ఫారమ్‌లను ఉత్పత్తికి రూ.100 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. హైదరాబాద్‌లో కొత్త యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను, అలాగే ఘనపదార్థాలు మరియు ఇంజెక్టబుల్స్‌లో కొత్త ఉత్పత్తి అభివృద్ధి కార్యకలాపాలను కొనసాగించాలని యోచిస్తోంది.

మరో ప్రముఖ కంపెనీ మీషోతో మంత్రి కేటీఆర్ జరిపిన చర్చల ద్వారా హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ అంగీకరించింది. దీంతో ఇది తెలంగాణ అంతటా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లతో పాటు రాష్ట్రం అందించే వివిధ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుని రిటైల్ విక్రేతలతో అనుసంధానం చేయనుంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల వ్యాపారులు ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు సాగించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని మీషో ప్రతినిధులు పేర్కొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో లూలు గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఇది గల్ఫ్ దేశాలకు మరియు ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ప్రపంచ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ నిర్మించనుంది. ఈ ఒప్పందంతో, హార్టికల్చర్ మరియు పశువుల పెంపకంలో ఉన్న రైతులకు లాభదాయకమైన మార్కెట్‌ను అందించడానికి తోడ్పడనుంది. తెలంగాణ నుంచి యూరప్‌, గల్ఫ్ సహా వివిధ విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు త్వరలో తమ యూనిట్‌ను ప్రారంభిస్తామని లూలు గ్రూప్ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ