అంతర్వేదిలో నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌

41 feet of Antarvedi new chariot, Antarvedi, Antarvedi chariot, Antarvedi New Chariot, Antarvedi Temple, AP CM YS Jagan, AP CM YS Jagan Inaugurated Antarvedi New Chariot, AP CM YS Jagan Inaugurated Antarvedi New Chariot Today, CM inaugurate Antarvedi temple chariot, Jagan inaugurate new chariot for Antarvedi temple, Latest News on antarvedi chariot, Mango News, new chariot of Antarvedi, New temple chariot

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం వైఎస్ జగన్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. అనంతరం అంతర్వేది ఆలయ నూతన రథాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

అంతర్వేదిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో 41 అడుగుల ఎత్తైన నూతన రథాన్ని రాష్ట్రప్రభుత్వం చేయించింది. ఏడు అంతస్తులతో కూడిన ఈ నూతన రథాన్ని 3 నెలల కాలంలోనే అత్యుత్తమంగా నిర్మించారు. శుక్రవారం నుంచి స్వామి కల్యాణోత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 28 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా సిద్ధం చేసిన రథాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబు, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here