ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5120 పాజిటివ్ కేసులు, 34 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 7, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,34,427 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6086 కి పెరిగింది. మరో 6349 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 66,769 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన తూర్పుగోదావరిలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, చిత్తూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు మరియు ప్రకాశంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6086 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 7, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 62,83,009
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 7,34,427
- కొత్తగా నమోదైనా కేసులు : 5120
- నమోదైన మరణాలు : 34
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 6,78,828
- యాక్టీవ్ కేసులు : 49513
- మొత్తం మరణాల సంఖ్య : 6086
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu