గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. బుధవారం ఉదయం ఎస్ఈసీ పార్థసారథి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు తేదీ ఇంకా ఖరారు కాలేదని, అయితే నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ లు మరియు బ్యాలెట్ పేపర్ల విధానంలోనే నిర్వహించనున్నట్టు ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతోనా లేదా ఈవీఎంలతో నిర్వహించాలా అనే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోగా, మెజార్టీ పార్టీలు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu