ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 74,041 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 9881 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. నెల్లూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం వంటి 4 జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 26, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,43,441 కు చేరుకుంది.
ఇక కరోనా వలన నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు మరియు ప్రకాశంలో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7736 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 4431 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 9,40,574 కు చేరింది. అలాగే ప్రస్తుతం 95,131 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,60,68,648 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(9881):
- నెల్లూరు – 1592
- తూర్పుగోదావరి – 1302
- గుంటూరు – 1048
- విశాఖపట్నం – 1030
- శ్రీకాకుళం – 906
- చిత్తూరు – 860
- కర్నూల్ – 629
- విజయనగరం – 616
- ప్రకాశం – 522
- కడప – 483
- అనంతపూర్ – 395
- కృష్ణా – 310
- పశ్చిమగోదావరి – 188
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ