ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 22 వ తేదీన తాడేపల్లిలో మొక్కలు నాటి “వన మహోత్సవం” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో కోటి మొక్కలు నాటాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 12721 కిలోమీటర్ల పొడవునా రోడ్లకు ఇరువైపులా 70 లక్షల మొక్కలు, అలాగే ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లే అవుట్ వద్ద 30 లక్షల మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. జూలై 20 వ తేదీలోగా వన మహోత్సవ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలనీ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu