కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, పలు విద్యారంగ కార్యక్రమాలు నిలిచిపోయి, స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లతో పాటుగా ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో ఉన్న స్కూళ్లకు కూడా జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా క్యాలెండర్ ఇయర్ ప్రకారం జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా తెలియజేసింది. అయితే జూన్ 11 తర్వాత స్కూళ్లను మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలనేది కోవిడ్–19 (కరోనా వైరస్) పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే తదుపరి ఆదేశాల ప్రకారం నిర్ణయిస్తామని పాఠశాల విద్యాశాఖ మే 1, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu