ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 9, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,718 కు చేరుకుంది. గత 24 గంటల్లో 31,054 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 231 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 37, తూర్పుగోదావరి జిల్లాలో 36, గుంటూరు జిల్లాలో 31, కృష్ణా జిల్లాలో 28, విశాఖపట్నం జిల్లాలో 22, నెల్లూరు జిల్లాలో 19, కడప జిల్లాలో 16, పశ్చిమగోదావరిలో 13, ప్రకాశం జిల్లాలో 11, అనంతపూర్ జిల్లాలో 8, శ్రీకాకుళం జిల్లాలో 6, విజయనగరంలో 4, కర్నూల్ జిల్లాలో 0 కేసులు నమోదయ్యాయి.
అలాగే రాష్ట్రంలో కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14403 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 362 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,51,082 కు చేరింది. అలాగే ప్రస్తుతం 3,233 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక నవంబర్ 9 నాటికీ ఏపీలో మొత్తం 2,98,05,446 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ