ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం, కొత్తగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం, నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడం వంటి అంశాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. అలాగే సెప్టెంబర్ 5న స్కూల్స్ ప్రారంభం రోజున విద్యార్థులకు ఇచ్చే వైఎస్ఆర్ విద్యాకానుక, డిసెంబర్ నెల నుంచి రాష్ట్రంలో నాణ్యమైన బియ్యం పంపిణీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu