తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే ఏపీలో అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో ఎంపికైన వారి పదవీకాలం ఏప్రిల్ 1, 2022తో ముగియనున్న నేపథ్యంలో ఈసీ తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
తెలంగాణ, ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – నవంబర్ 16
- నామినేషన్లకు ఆఖరితేదీ – నవంబర్ 23
- నామినేషన్ల పరిశీలన – నవంబర్ 24
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – నవంబర్ 26
- ఎన్నిక జరిగే తేదీ – డిసెంబర్ 10
- పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – డిసెంబర్ 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ