ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 64,800 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 4,872 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 961, తూర్పుగోదావరి జిల్లాలో 810, అనంతపూర్ లో 535, ప్రకాశంలో 447 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,63,211 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 86 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో పదమూడు మంది, గుంటూరులో పదిమంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, విజయనగరంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో నలుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11552 కి పెరిగింది. గత 24 గంటల్లో 13702 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 16,37,149 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ