ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,02,712 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 6151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూన్ 17, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,32,902 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 58 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12167 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 7728 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 17,50,904 కు పెరిగింది. ప్రస్తుతం 69,831 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(6151):
- నెల్లూరు – 274
- తూర్పుగోదావరి – 1244
- గుంటూరు – 331
- విశాఖపట్నం – 237
- శ్రీకాకుళం – 264
- చిత్తూరు – 937
- కర్నూల్ – 203
- విజయనగరం – 199
- ప్రకాశం – 554
- కడప – 478
- అనంతపూర్ – 359
- కృష్ణా – 424
- పశ్చిమగోదావరి – 647
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ