సౌథాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో రేపటి నుంచే (జూన్ 18) ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2021 ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పై క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తి నెలకుంది. కాగా ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో తలపడే 11 మంది ఆటగాళ్లతో కూడిన భారత్ తుది జట్టును బీసీసీఐ గురువారం నాడు విడుదల చేసింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆరుగురు బ్యాట్స్ మెన్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ వంటి పాస్ట్ బౌలర్లతో భారత్ జట్టు రంగంలోకి దిగుతుంది.
భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ