రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే పరీక్షల నిర్వహణ తేదీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. ముందుగా గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ, పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక సుప్రీంకోర్టు నోటీసుల విషయం తమ దృష్టికి ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. పరీక్షలపై మొదటి నుంచి కూడా తమ స్టాండ్ ఒక్కటే అని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ